శారదాదేవి( sarada devi)
K Sarada Devi
పులివెందులకు దగ్గర లో ఉన్న నల్లపురెడ్డి పల్లె లో
6.5.1966లో కీర్తిశేషులు బీసీ వెంగముని, శ్రీమతి బి నారమ్మ గార్లకు
జన్మించిన బుర్రా శారదా దేవి తిరుపతి పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల లో చదివారు.
కదిరి కి చెందిన టీచరుగా పనిచేస్తున్న కీర్తిశేషులు కె గంగన్న కె వసుదేవమ్మ గార్ల కుమారుడు కొమ్మల వెంకటరత్నమయ్య గారిని వివాహం చేసుకున్న తర్వాత కదిరిలో ఉన్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.
పెద్దమ్మాయి లావణ్య యం.టెక్. పూర్తి చేసి బెంగళూరు లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. రెండో అమ్మాయి సౌజన్య యం.డి.ఎస్ పూర్తి చేసి డెంటల్ డాక్టర్ అయ్యారు.
మూడో అమ్మాయి చైతన్య యం.బి.ఏ.పూర్తి చేశారు. వీరందరికీ వివాహం చేశారు.
1993 లో యల్ ఐ సి ఏజెన్సీ ని యల్ ఐ సి
డెవలప్మెంట్ ఆఫీసర్ పిళ్లా విజయకుమార స్వామి రెడ్డి దగ్గర తీసుకున్నారు.ఒకవైపు యల్ ఐ సి వ్యాపారం చేస్తూనే B.A. పూర్తి చేశారు.డెవలప్మెంట్ ఆఫీసర్ కుమారస్వామి రెడ్డి సహకారంతో బ్రాంచి మేనేజరు క్లబ్ మెంబర్ అయ్యారు.శతకవీర్ కూడా అయ్యారు.
ప్రస్తుతం వీరు అనంతపురం లో నివసిస్తున్నారు. యల్ ఐ సి వ్యాపారాన్ని ఎన్నో కుటుంబ బాధ్యతల మధ్య అలుపెరుగకుండా చేస్తూ ఉన్నారు.

Comments
Post a Comment